Saturday, April 27, 2024

Suryapet: గుండెపోటుతో కాంగ్రెస్ నేత మృతి

సూర్యాపేట ప్రభన్యూస్ : సూర్యాపేట కాంగ్రెస్ నాయకుడు నామ ప్రవీణ్ గుండెపోటుతో మృతి చెందారు. ఇవాళ గుండెపోటుకు గురైన ప్రవీణ్ ను హుటాహుటిన కామినేని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డికి ఆత్మీయుడుగా ఉంటూ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.

గత మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సతీమణి అరుణను మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమైన కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో తమ అభిమాన నేత రమేష్ రెడ్డికి టికెట్ కేటాయించాలని తన టీమ్ తో ఢిల్లీకి వెళ్లి అగ్ర నేతలను కలిసి అభ్యర్ధించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement