Thursday, May 9, 2024

Kadapa : రాజన్న ఆశయాలే స్ఫూర్తి

పులివెందుల, అక్టోబర్ 30 (ప్రభ న్యూస్): పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కు నా శాయశక్తుల కృషి చేస్తానని రాజన్న ఆశయాల స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్తానని పులివెందుల మండల అధ్యక్షుడు కేతిరెడ్డి తిరుపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యునిగా నాపై నమ్మకంతో ఇవ్వడం చాలా సంతోషం అన్నారు. నాకు ఈ పదవి ఇవ్వడానికి కృషి చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.

పులివెందుల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా అన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 5 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంటు, ఇవ్వడం జరుగుతుందన్నారు. రాజన్న బాటలో కాంగ్రెస్ నడుస్తూనే ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందించారో జరగబోయే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వస్తే అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. బిజెపి పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని 24 ఎన్నికలలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం తద్యమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement