Monday, April 29, 2024

Suicide – అత్తింటి వేధింపుల‌కు న‌దిలోకి దూకి తోటికోడ‌ళ్లు ఆత్మ‌హ‌త్య ..

ఏలూరు జిల్లా దుగ్గిరాల మండలం పినకడిమిలో విషాదం చోటుచేసుకుంది. అత్తమామల వేధింపులు తాళలేక కృష్ణానదిలో దూకి ఇద్దరు తోడికోడళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్న కోడలు పాలపాటి స్వాతి మృత దేహం లభ్యం కాగా.. పెద్ద కోడలు రూపాదేవి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నదిలో ఆమె కోసం ఇంకా గాలిస్తున్నారు. అత్తమామలు తన కూతురిని ఎంతగానో క్షోభ పెట్టినట్లు మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement