Tuesday, May 21, 2024

పాఠశాలల అభివృద్ధితో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు – ఎమ్మెల్యే రేఖా నాయక్

నిర్మల్ జిల్లా, ఖానాపూర్ రూరల్, జూన్ 20 (ప్రభ న్యూస్): పాఠశాలల అభివృద్ధితో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసినట్లు అవుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్, సుర్జాపూర్ గ్రామాల్లో ప్రైమరీ పాటశాల భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో కార్యక్రమం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పల్లెలు పట్టణాలు అభివృద్ధి దిశగా మారుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం దృడమైనదని, అరవై సంవత్సారాలలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిది సంవత్సరాల్లో జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement