Tuesday, May 21, 2024

Suicide – బాసరలో రాలిన మ‌రో విద్యా కుసుమం..

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్లోని నాలుగో అంతస్తు గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూలు జిల్లాకు చెందిన ఆర్. ప్రవీణ్ కుమార్ బాసరలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అనూహ్యంగా ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతంయువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement