Monday, April 29, 2024

Student suicide: విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం… రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య

ఘట్కేసర్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. బీబీనగర్ వైపు నుంచి సనత్‌న‌గర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని.. అతని వద్ద లభించిన పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాల ఆధారంగా మృతుడు నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి విజయకుమార్(27)గా గుర్తించారు. ఈ క్రమంలో కళాశాల నిర్వాహకులకు, పెద్ద చర్లపల్లిలోని తండ్రి శ్రీనివాస్‌కు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement