Tuesday, April 30, 2024

Sultanabad : తీరు మారకుంటే కఠిన చర్యలు.. సిఐ జగదీష్

సుల్తానాబాద్ (ప్రభా న్యూస్) : గతంలో వివాదాస్పద చరిత్ర ఉన్నవారు పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని సుల్తానాబాద్ సీఐ జగదీష్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్స్, సస్పెక్ట్ షీటర్లకు నేర ప్రవృత్తి మానుకోవాలని సూచించారు. గతంలో నేర చరిత్ర ఉండి కేసులు నమోదయి జైలుకు వెళ్లివచ్చినవారు సత్ప్రవర్తనతో ఉండాలన్నారు. సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ఇటువంటి వారిపై పోలీసులు డేగ కన్ను ఉంటుందని వారి కదలికలపై నిఘా ఉంటుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు విజయేందర్, వెంకటకృష్ణ, రామకృష్ణ, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement