Tuesday, May 7, 2024

Breaking: ఆపండి మీ ఉపన్యాసం, బండి పాదయాత్రలో వ్యతిరేకత!.. జనగామ జిల్లాలో ఘర్షణ (వీడియో)

జనగామ (ప్ర‌భ న్యూస్‌) : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశారు. బండి సంజ‌య్ మాట్లాడుతుండ‌గా ‘‘ఆపండి మీ ఉపన్యాసం” అంటూ ఎగతాలి చేశారు. ఈ ఘటన ఇవ్వాల (శ‌నివారం) రాత్రి జనగామ జిల్లాలో జరిగింది. స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ గ్రామంలో జరుగుతున్న సభ వద్ద బండి ప్రసంగిస్తుండగా ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, గ్యాస్ పెంపు తదితర పథకాలపై ‘ఆపండి మి ఉపన్యాసం స‌ అని కామెంట్స్ చేశారు..

దీంతో వెంటనే కాంగ్రెస్​ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ విషయాన్ని ఆ గ్రామస్తులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని అందరినీ చెదరగొట్టారు. కాంగ్రెస్​ నాయకుడు రామచందర్ ని పోలీసులు ఇంటికి క్షేమంగా చేర్చారు.. దీంతో బండి పాదయాత్రలో హై టెన్షన్ నెలకొంది.

వీడియో కోసం www.prabhanews.comలో చూడండి

Advertisement

తాజా వార్తలు

Advertisement