Thursday, May 2, 2024

కేసముద్రంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్ బోల్తా

కేసముద్రం, జులై 24(ప్రభాన్యూస్ ): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడగా విద్యార్థులకు స్వల్ప గాయాలతో బయటపడ్డ సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్ సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను ఊర్లలోని తమ తమ ఇండ్లకు పంపించేందుకు బస్సులో డ్రైవర్ తీసుకుని బయలు దేరాడు. స్కూల్ నుంచి మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు ద్వారా బస్సును డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తుండగా మహబూబ్ చికెన్ షాప్ సమీపంలో అదుపు తప్పి పెద్దగా ఉన్న సైడు కాలువలో బోల్తా పడింది.

దింతో డ్రైవర్ పారిపోగా, బస్సులో ఉన్న విద్యార్థులను అక్కడే ఉన్న స్థానికులు, హమాలీలు విద్యార్థులను బయటకు తీశారు. ఈ సంఘటనలో45 మంది విద్యార్థులు ఉండగా కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయలతో బయట పడ్డారు. కాగా ఈ పాఠశాల పేరుతో అనుమతి లేకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement