Sunday, April 28, 2024

సౌండ్ పొల్యూష‌న్ -మూడు ప‌బ్ ల‌పై కేసు న‌మోదు

రాత్రి 10గంట‌లు దాటితే హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఏ ప‌బ్ లో కూడా సౌండ్ వినిపించ‌కూడ‌ద‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే హైకోర్టు ఆదేశాల‌ను ప‌బ్‌లు య‌థేచ్ఛ‌గా ఉల్లంఘిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై దృష్టి సారించిన హైద‌రాబాద్ పోలీసులు శ‌నివారం న‌గ‌రంలోని 3 ప‌బ్‌ల‌పై కేసులు న‌మోదు చేశారు. న‌గ‌రంలోని అమ్నీషియా, ఎయిర్ లైవ్‌, జీరో 40 ప‌బ్‌లు శుక్ర‌వారం రాత్రి 10 గంట‌లు దాటినా డీజే సౌండ్ల‌తో త‌మ క‌స్ట‌మ‌ర్లను రంజింప‌జేశాయి. ఈ ఘట‌న‌ల‌పై సమాచారం అందుకున్న పోలీసులు 3 ప‌బ్‌ల‌పై కేసులు నమోదు చేశారు. సౌండ్ పొల్యూష‌న్‌కు సంబంధించి హైకోర్టు ఆదేశాలను బేఖాత‌రు చేసిన కార‌ణంగానే ఈ ప‌బ్‌ల‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement