Thursday, May 16, 2024

ముంబ‌యిలో భారీ అగ్నిప్ర‌మాదం-బాల్క‌నీలో వేలాడిన బాధితులు

ఓ బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నంలో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. చాలా మంది నివాసితులు బాల్క‌నీలో వేలాడుతూ.. తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ త‌రుణంలో త‌మ‌ని కాపాడ‌మని అక్క‌డి వారిని వేడుకున్నారు. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది..ముంబ‌యి చెంబూర్‌లోని న్యూ తిలక్ నగర్ ప్రాంతంలోని బ‌హుళ‌ అంతస్తుల నివాస భవనంలో శ‌నివారం మంటలు చెలరేగాయి. ఈ భవనంలోని 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి, ఈ కారణంగా ఈ భవనంలో నివసిస్తున్న చాలా మంది భవనంలో చిక్కుకున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement