Saturday, May 4, 2024

పొగమంచుతో కమ్ముకున్న రోడ్లు.. వాహనదారులకు తప్పని ఇక్కట్లు…

వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి సదాశివ్పేట్ నవపేట్ వెళ్లే రోడ్డు మార్గంలో బుధవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఆయా గ్రామాలని పూర్తిగా పొగమంచుతో నిండిపోయాయి. పండగ వేళ ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.

మరోవైపు వికారాబాద్ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నవపేట్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement