Monday, May 6, 2024

Siddipet – కాంగ్రెస్ కు ఓటేస్తే మ‌న‌క‌న్నును మ‌నం పొడుచుకున్న‌ట్లే – హ‌రీష్ రావు

సిద్దిపేట – పొరపాటున కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే పదేండ్లు వెనక్కిపోతామని మంత్రి హరీష్ రావు అన్నారు. అబద్దాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ అని అన్నారు. అధికారం మీద యావ ఎక్కువ అన్నారు. అబద్దాలతో అధికారం లోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ తో జాగ్రత్త గా ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ కి అధికారం ఇస్తే మన ఏళ్ల తో మన కన్ను పొడుచుకున్నట్టే అని తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష సీఎం కేసీఆర్ పాలన అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కంటే కాంగ్రెస్ అధికారాన్ని ఎక్కువగా ప్రేమిస్తోందని విమర్శించారు.. రైతుబంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని అన్నారు. ఉమ్మడి పాలనలో కరువు కాటకాలతో సతమతమయ్యేవారని, నేడు హరితహారంగా మార్చామన్నారు. ఐక్య మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement