Thursday, May 2, 2024

TS: డీకే అరుణకు షాక్… ఎమ్మెల్యే కృష్ణమోహన్ కు ఊరట

న్యూఢిల్లీ: గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. గద్వాల్ నుంచి బీఆర్ఎస్ తరపున కృష్ణమోహన్ పోటీ చేసి ఆనాడు తన సమీప ప్రత్యర్థి డీకే అరుణపై విజయం సాధించారు. ఈ ఎన్నికపై డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు అఫిడవిట్ తో ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించారంటూ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కృష్ణమోహన్ ఎన్నికను రద్దు చేస్తూ, డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించింది. దీనిపై కృష్ణమోహన్ సుప్రీంను ఆశ్రయించడం, హైకోర్టు తీర్పుపై స్టే రావడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement