Thursday, May 2, 2024

చంద్ర‌బాబుకు జైలులో ప్రాణ‌హాని – లాయర్ సిద్ధార్థ లూథ్రా

గుంటూరు – ప్ర‌స్తుతం రాజ‌మండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కు జైలులో ప్రాణ‌హాని ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా. విజ‌య‌వాడ ఎసిబి కోర్టులో హౌజ్ అరెస్ట్ పై వాద‌న‌లు వినిపించేందుకు వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, జైల్లో చంద్రబాబును ఉంచడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. గతంలో పశ్చిమబెంగాల్ మంత్రుల విషయంలో జరిగిన ఉదంతాలను కోర్టులో ప్రస్తావిస్తామని తెలిపారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని చెప్పారు. సాధార‌ణంగా ట్రైల్ కోర్టులో బెయిల్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌ని, అందుకు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోష‌న్ దాఖ‌లు చేస్తామ‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement