Thursday, May 9, 2024

శివనామస్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు..

కార్తీక మాసం సందర్భంగా కుత్బుల్లాపూర్ లోని పలు శైవ క్షేత్రాలు సోమవారం శివనామస్మరణతో మారుమోగాయి. రెండవ కార్తీక సోమవారం కావడం, సుద్ద ఏకాదశి కావడంతో భక్తులు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారు జామున‌ 4 గంటల నుండి పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రెండవ కార్తీక సోమవారం కావడంతో సూరారం శివాలయం నగర్ లోని శివహిల్స్ లో గల ఉమామహేశ్వర ఆలయంలో ఆలయ ధర్మక‌ర్త‌ ముద్దాపురం మదన్ గౌడ్, మంజుల దంపతుల చేత ఆలయ అర్చకులు రవిశర్మ ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. మహిళలు సామూహిక అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం పరమశివునికి జ్యోతిర్లింగార్చన నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement