Monday, April 29, 2024

పత్తిరైతు నవ్విండు.. క్వింటాలుకు 14వేల ధర

కాశిబుగ్గ (ప్రభన్యూస్): ప‌త్తి రైతులు సంతోష‌ప‌డే విష‌య‌మిది. ఎందుకంటే ఇంత‌కాలం త‌క్కువ రేటుకు అమ్ముకున్న రైతుల‌కు రేటు పెరిగిందంటే సంతోష‌మే క‌దా.. వ‌రంగ‌ల్ జిల్లాలోని ఏనుమముల మార్కెట్ లో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) క్వింటా ప‌త్తికి 14వేల రేటు ప‌లికింది. జనగామ జిల్లాకు చెందిన రైతు ప్రభాకర్ అనే రైతు ఈ రేటు చూసి హ్యాపీగా ఫీల‌య్యాడు. కునూరు మండలం జాఫర్ గడ్ నుంచి లక్ష్మీ సాయి ట్రడర్స్ కు 20 బస్తాల పత్తి తీసుకుని రాగా మార్కెట్ చరిత్రలోనే మొదటి సారి 14 వేల రూపాయలు పలికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement