Saturday, April 27, 2024

షాద్ నగర్ ను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం – ఎమ్మేల్యే అంజయ్య యాదవ్

షాద్ నగర్. సేప్టెంబర్ 24 ప్రభ న్యూస్ షాద్ నగర్ ను స‌ర్వాంగ సుందరంగా తీర్చిదిద్ద‌డ‌మే త‌మ లక్ష్యమనిషాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం నాడు పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ చైర్మన్ కే నరేందర్ , కమిషనర్ వెంకన్న స్థానిక కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి ప్రజలంతా ఆయన్ను దేవుడుగా కొలుస్తున్నారని అన్నారు. గ్రామాలు పట్టణాలు పూర్తి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు షాద్నగర్లో అన్ని కాలనీలో సిసి రోడ్లు డ్రైనేజీలు పార్క్ అభివృద్ధి పనులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు అనంతరం 10 లక్షలతో నిర్మించిన ఎన్.జి.వోస్ కాలనీ పార్క్ కాంపౌండ్ వాల్ ప్రారంభించి, 10 లక్షల సి.సి రోడ్డు నిర్మాణపనులకు భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం ప్రతాపరెడ్డి కొవ్వూరు నవీన్ కుమార్ గడ్డం నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement