Sunday, May 5, 2024

TS: మహిళా పోలీసు స్టేషన్ ఏర్పాటుపై హోంమంత్రిని కలిసిన ఎమ్మెల్యే కోరుకంటి

గోదావరిఖని, సెప్టెంబర్ 25 (ప్రభ న్యూస్) : రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలో మహిళా పోలీసు స్టేషన్ ను త్వరగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ ఆలీని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. హైదరాబాదులో హోంమంత్రిని ఎమ్మెల్యే మార్యదపూర్వకంగా కలిశారు. గోదావరిఖనిలో త్వరగా మహిళా పోలీసు స్టేషన్ పనులు ప్రారంభించాలన్నారు. దీనిపై హోంమంత్రి సానుకులంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్ సాగంటి శంకర్, నారాయణదాసు, మారుతి గౌస్ పాషా, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement