Monday, April 29, 2024

Secretariat : వంద రోజుల కంటి వెలుగు సంబరం.. కేక్ క‌ట్ చేసిన మంత్రులు

వంద రోజుల కంటి వెలుగు సంబరాలు బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప‌లువురు మంత్రులు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్,TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ పథకం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకోవ‌డం పట్ల మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఆశా వర్కర్లకు కేక్ కట్ చేసి తినిపించి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కంటి వెలుగు విజయవంతంగా నిర్వహించేందుకు పాలు పంచుకున్న వైద్యారోగ్య శాఖ.. సహకరించిన ఇతర శాఖలు, ప్రజా ప్రతినిధులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అలోచనతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకొని, లక్ష్యానికి మించి కంటి పరీక్షలు చేయడం జరిగిందన్నారు.

నివారింపదగిన, అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మందికి కంటి వెలుగును ప్రసాదించిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు చేసారు. ఇందులో దృష్టి లోపం ఉన్న 40.59 లక్షల మందికి అంటే 25.1 శాతం మందికి గ్లాసెస్ పంపిణీ చేయడం జరగింది. ఇందులో 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందించారు. 18.08 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటికే 24 జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయింది. మిగిలిన 9 జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తి నీ కొనసాగిస్తూ కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. కంటి వెలుగు సంబరాలలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్,TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ తో పాటు వైద్యారోగ్య శాఖ సెక్రెటరీ రిజ్వి, హెల్త్ కమిషనర్ శ్వేత మహంతి, డి హెచ్ శ్రీనివాసరావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, టిఎస్ఎంఎస్ ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ స్వరాజ్య లక్ష్మి, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement