Sunday, April 28, 2024

SCCL: సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు రూ.500 కోట్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామగుండంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు రూ.500 కోట్ల కేటాయించినట్లు సింగరేణి ఛైర్మన్ ఎన్.శ్రీధర్. వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి KCR సూచన మేరకు వైద్య కళాశాలకు ప్రత్యేక నిధుల మంజూరు చేశారు. సోమవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆమోదించారు. రెండేళ్ల లో పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు సింగరేణి ఛైర్మన్ ఎన్.శ్రీధర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement