Sunday, April 28, 2024

ప్రెస్ క్లబ్ స్థలాని కాపాడాల‌ని కలెక్టర్ కు విన‌తి


జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ కు రక్షణ కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కందికొండ మోహన్, పుట్టపాగ వెంకటస్వామి, సత్యంలు మాట్లాడుతూ…. 2004లో ఒక కమిటీని నిర్ధారించి సర్వే నెంబర్ 332 లో 176 చదరపు గజాల స్థలాన్ని ప్రెస్ క్లబ్ కు కేటాయించారన్నారు. ఆ స్థలాన్ని ఆర్టీసీ సంస్థ వారు అక్రమంగా ఆక్రమించి నిర్మాణం చేయుటకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. జిల్లా ఏర్పడి ఏడు సంవత్సరాలు కావస్తున్నా మండలం, అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రెస్ క్లబ్ లు ఉన్నాయి, కానీ జిల్లా కేంద్రంలో లేకపోవడం బాధాకరమైన విషయమన్నారు. జర్నలిస్టుల బాధను అర్థం చేసుకుని త‌మకు కేటాయించిన 176 చదరపు గజాల స్థలాన్ని ప్రెస్ క్లబ్ కు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హకీం కిషోర్, దర్వేష్ కొండ కింది మాధవరెడ్డి, కంచర్ల శ్యామ్ సుందర్, పంగిడి చెరువు వెంకట స్వామి, సహదేవుడు, ఎస్ ఎస్ బాబు, రాంబాబు, బాదం పరమేశ్వర్, విజయ భాస్కర్, రమేష్, వెంకటేష్, సందు యాదగిరి, దశరథం శేఖర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement