Saturday, March 23, 2024

Breaking : వైసీపీ అరాచ‌కాలకి హ‌ద్దే లేదు..’చంద్ర‌బాబు’..

వైసీపీ అరాచ‌కాల‌కు అడ్డే లేకుండా పోతోంద‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.టిడిపి అభ్య‌ర్థుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశార‌న్నారు. నామినేష‌న్ వేయ‌నివ్వ‌కుండా చేశార‌ని ఆరోపించారు.నామినేష‌న్ కేంద్రంలో దారికాచి అడ్డుకున్నార‌ని తెలిపారు. మేం ఎన్నో ప్రికాష‌న్స్ ని తీసుకున్నామ‌న్నారు. ప‌లువురు పోలీసులు,అధికారులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు. ఇన్ని ప్రికాష‌న్స్ నా రాజ‌కీయ జీవితంలో ఎన్న‌డూ తీసుకోలేద‌ని వాపోయారు. ఏడుసార్లు కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించాన‌ని గుర్తు చేశారు. కుప్పం ప్ర‌జ‌లు న‌న్ను ప్ర‌చారానికి రావొద్ద‌ని చెప్పార‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. కుప్పం 14వ వార్డులో బెస్త కులానికి చెందిన వెంక‌టేష్ నామినేష‌న్ వేశాడ‌ని చెప్పారు. వెంక‌టేష్ ని బుల్లెట్ పై వ‌చ్చి ఢీ కొని పోయార‌ని వాపోయారు. వీలైనంత వ‌ర‌కు అంద‌రికీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఇవ్వాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement