Saturday, May 4, 2024

Sanga Reddy – అదనపు కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్, మాధురి

సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) గా ఆర్.డి. మాధురి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు ఇద్దరూ జిల్లా కలెక్టరేట్ లోని తమ తమ చాంబర్లలో పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ నగేష్, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు అదనపు కలెక్టర్లకు స్వాగతం పలికి, పరిచయం చేసుకుని, శుభాకాంక్షలు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్(రెవిన్యూ) గా కొనసాగిన బి. చంద్రశేఖర్ ను సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) గా కొనసాగిన జి . వీరారెడ్డిని సీసీఎల్ఏ కార్యాలయానికి బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో జగిత్యాల ఆర్డిఓ గా పనిచేస్తున్న ఆర్.డి. మాధురిని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) గా ప్రభుత్వం నియమించింది. ఈమేరకు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement