Monday, April 29, 2024

Variety : నామినేషన్ రోజున కర్ర తిప్పిన బిజెపి అభ్యర్ధి సంధ్యారాణి

రామగుండం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి కర్రసాము చేశారు. శుక్రవారం నామినేషన్ వేసేందుకు బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సంధ్యారాణి కర్రసాము విన్యాసం చేశారు. ఇటీవల బీఆరెస్స్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరిన కందుల సంధ్యారాణికి ఆ పార్టీ అధిష్టానం మొదటి జాబితాలోనే ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది.

ఇప్పటికే సంధ్యారాణి రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జెడ్పీటీసీగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈమె ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రచారంలో కొనసాగుతోన్నారు. ఈ సమయంలో… సంధ్యారాణికి బిజెపి అధిష్టానం టికెట్ కేటాయించడంతో రామగుండంలో రాజకీయం మరింత రసవత్తంగా మారనుంది.ఇప్పటికే బీఆరెస్స్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోరుకంటి చందర్ బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు ఇటీవల టికెట్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement