Thursday, May 2, 2024

AP: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి… కన్నా లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడన్నారు. ఏపీకి జగన్ ఎందుకు అవసరం లేదో వంద కారణాలు చెబుతామన్నారు.

వంద కారణాలతో పుస్తకం కూడా విడుదల చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఒకసారి అవకాశమిస్తేనే ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టారని.. మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని బ్రిటీష్ వాళ్లకు అమ్మేస్తాడని అన్నారు. అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కన్నా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement