Saturday, April 27, 2024

TS: సమ్మక్క పూజారి దశరథం అనారోగ్యంతో మృతి

తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన దశరథం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మేడారంలో విషాధచాయలు అలుముకున్నాయి. నాడు అన్న నేడు తమ్ముడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోఖ సముద్రంలో మునిగారు.

ఆసియా ఖండాల్లోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మల పూజారి సిద్దబోయిన లక్ష్మణరావు గత పది నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. అనంతరం తమ్ముడైన సిద్ధబోయిన దశరథం అనారోగ్యంతో మంగళవారం మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement