Wednesday, May 8, 2024

గ‌వ‌ర్న‌ర్ క‌రుణ కోసం ఆర్టీసీ ఉద్యోగులు .. విలీన బిల్లుపై న్యాయ సలహా అవసరమన్న తమిళి సై

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మే`రకు సీఎం కేసీఆర్‌‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, పాస్ చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును రూపొందించింది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో రెండు రోజుల క్రితం గవర్నర్ తమిళి సై ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది.

కానీ గవర్నర్ తమిళిసై ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు. రెండు రోజులుగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని బీఆర్‌‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రస్తుతం గవర్నర్ పాండిచ్చేరిలో ఉన్నట్లు సమాచారం ..మరో రెండు రోజులు అక్కడే ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.. ఇక అసెంబ్లీకి ఇదే చివరి సెషన్. శుక్ర, శనివారాల్లో మాత్రమే అసెంబ్లీ కొనసాగనుంది. ఈ సెషన్ ముగిసేలోగానే బిల్లును గవర్నర్‌‌ ఆమోదించాల్సి ఉంది. కానీ బిల్లును ఆమోదించే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల వేళ అసెంబ్లీ స‌మావేశాలు ఇవే చివ‌రివి.. ఒక వేళ బిల్లుపై గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర వేయ‌క‌పోతే… ఆర్టీసీ విలీన ప్ర‌క్రియ‌కు నిలిచిపోనుంది.. తిరిగి ఎన్నిక‌లు జ‌రిగి కొత్త ప్ర‌భుత్వ వ‌చ్చిన అనంత‌రమే నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సి ఉంటుంది..

బిల్లు వచ్చింది…న్యాయ సలహా తీసుకుంటున్నా … గవర్నర్
ఆర్టీసీ విలీన బిల్లు తన వద్దకు వచ్చిందని గవర్నర్ తమిళి సై వెల్లడించారు.. ఈ నెల రెండో తేది మధ్యాహ్నం 3.30కి రాజభవన్ కు బిల్లు చేరిందన్నారు.. ఆర్థికపరమైన బిల్లు కావడంతో న్యాయ సలహా తీసుకోవలసి ఉందని గవర్నర్ పేర్కొన్నారు.. న్యాయ సలహా ప్రక్రియకు కొంత సమయం పడుతుందని అంటూ త్వరలోనే బిల్లుపై తన అబిప్రాయం వెల్లడిస్తానని రాజ్ భవన్ నుంచి గవర్నర్ ఒక ప్రకటన విడుదల చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement