Sunday, April 28, 2024

TS : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

గీసుగొండ, మార్చి 31 (ప్రభ న్యూస్) : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. గీసుగొండ మండలంలోని మచ్చాపూర్ గ్రామ పరిధిలో వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారి పై ఈ ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

- Advertisement -

మృతులు ఇద్దరు నర్సంపేట పట్టణానికి చెందిన మడి కొండ ప్రభాకర్ (27),ఇమ్మడి సామ్యూల్(20) గా గుర్తించారు.ప్రభాకర్ పెయింటర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానిక ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ సంఘట స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement