Saturday, April 27, 2024

రెండు డీసీఎంలు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఏపీ లింగోటం వద్ద రెండు డీసీఎంలు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement