Thursday, April 25, 2024

దేశంలో నిలకడగా కొనసాగుతోన్న కరోనా ఉధృతి..

దేశంలో రోజువారి కరోనా కేసులు ఎక్కడా తగ్గడం లేదు. ప్రతిరోజు నిలకడగా 40 వేల కు అటు ఇటుగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో నమోదైన క‌రోనా కేసుల తాజా వివరాలు ఇలా ఉన్నాయి. భార‌త్‌లో నిన్న 40,120 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 42,295 మంది కోలుకున్నారు. ఇక మరణాల విషయానికొస్తే… నిన్న 585 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,30,254కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,13,02,345 మంది కోలుకున్నారు. 3,85,227 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. నిన్న 57,31,574 వ్యాక్సిన్ డోసులు వేశారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 52,95,82,956 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

ఇది కూడా చదవండి: వాట్సప్ గ్రూప్ లో పోర్న్ వీడియో కలకలం..షాక్ అయిన మహిళలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement