ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటిలో సమావేశం
అక్కడికి వెళ్లిన సిఎం రేవంత్
భవనగిరి నేతలతో సుదీర్ఘ చర్చలు
అనుసరించాల్సిన వ్యూహంపై దిశ నిర్దేశం
హైదరాబాద్ – లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పలు పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై చర్చిస్తున్నారు. తాజాగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ నేడు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ నివాసంలో రాజ గోపాల్ తో పాటు భువనగిరి లోక్ సభ పరిధిలోని ముఖ్యనేతలు,కార్యకర్తలు హాజరయ్యారు..
వారితో రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు.. అక్కడ గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం వారికి ఎన్నికల వ్యూహంపై దిశ నిర్దేశం చేశారు.