(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : రెవెన్యూ ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శుక్ల కుమార్ ఇవ్వాల (సోమవారం) గుండెపోటుతో చనిపోయారు. సీ సీ ఎల్ ఎ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల సమావేశానికి హాజరైన ఆయన వాష్ రూం కు వెళ్లి చాలా సేపటిదాకా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి వెళ్లి చూడగా పడిపోయి ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్లు చనిపోయారని నిర్ధారించారు.
గుండెపోటు సీవియర్ గా రావడంతోనే ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పారు. శుక్ల కుమార్ పౌర సఫరాల శాఖలో నయాబ్ తహసీల్దార్ గా పని చేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే రెవెన్యూ ఉద్యోగులు…టీ ఎన్ జీ వో సంఘం నేతలు ఆసుపత్రికి తరలి వెళ్లారు. శుక్ల కుమార్ తో తమకున్న అనుబంధాన్ని యాది చేసుకున్నారు. అంత్యక్రియలు తన సొంత గ్రామం అయిన కేశం పేట మండలంలో మంగళవారం జరగనున్నాయి.