Wednesday, May 15, 2024

Political Dramas – కొత్త‌, బాల‌రాజుల‌పై దాడులు కోడి క‌త్తి డ్రామాలేః రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి ఘటనపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అదంతా డ్రామా అని కొట్టిపారేశారు. ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమేనని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఘటనలను సృష్టిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలకు ముందు కోడికత్తి ఘటన, బెంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం ఘటనలే ఇందుకు తార్కాణమని ఉదహరించారు.

కాగా, కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని ఇప్పటివరకు మీడియాకు ఎందుకు ప్రవేశపెట్టలేదని, దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలని అన్నారు. ఇప్పటివరకు నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయటపెట్టలేదని ఆయన అన్నారు. కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అన్నారని, ఆయన మాటలను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement