Saturday, May 4, 2024

Effigy Burned – బెల్లంపల్లిలో రేవంత్ రెడ్డికి నిరసన సెగ

బెల్లంపల్లి జులై 13 ( ప్రభ న్యూస్) – బెల్లంపల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ గురువారం దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో దహనం చేశారు. టిపిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులపై చేసిన వాక్యాలపై నిరసన చేశారు. మూడు గంటలకు కరెంటు వద్దు, 24 గంటల కరెంటు ముద్దు అని, నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం రైతు వేదిక ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్ పి వైస్ చైర్మన్ తోంగాల సత్యనారయణ ,మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, సర్పంచ్ లో జిల్లపెల్లి స్వరూప వెంకటస్వామి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement