Saturday, April 27, 2024

శశిథరూర్ కి రేవంత్ క్షమాపణ.. కాంగ్రెస్ ఎంపీ ఏమన్నారంటే..

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం చైర్మన్ హోదాలో ఇటీవల హైదరాబాద్ వచ్చిన శశిథరూర్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. దీంతో ఓ ఆంగ్ల పత్రికతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శశిథరూర్‌ను ఉద్దేశించి అనుచిత పదం ఉపయోగించారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. రేవంత్ పై విమర్శలు రావడంతో ఆయన స్పందించారు.

శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు రేవంత్ తెలిపారు. తాను అత్యంత గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శశిథరూర్ మాత్రమేనన్నారు. తన వ్యాఖ్యలపై శశిథరూర్‌కు వివరణ ఇచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్‌లో అందరూ విలువలు, విధానాలతో పనిచేస్తామని పేర్కొన్నారు. రేవంత్ క్షమాపణలపై స్పందించిన శశిథరూర్.. చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు ఆయన తనకు చెప్పారని అన్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి అందరం కలిసి పనిచేస్తామన్నారు.

ఇది కూడా చదవండిః తెలంగాణ మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు.. కేబినెట్ సబ్ కమిటీలో వారికి చోటు!

Advertisement

తాజా వార్తలు

Advertisement