Tuesday, May 14, 2024

Revanth Reddy | సీఎం ఆన్ డ్యూటీ.. తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచ‌న‌

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఈప్రకటనకు కొద్దిసేపటి ముందే ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో పలు జిల్లాల్లో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచిస్తూ ట్వీట్ చేశారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు.

రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌కు అభిమానులు, కార్యకర్తలు స్పందిస్తున్నారు. ‘సీఎం ఆన్ డ్యూటీ’, ‘కంగ్రాట్స్ సీఎం సాబ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అధికారిక ప్రకటన రాక ముందే రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement