Thursday, May 2, 2024

CM Revanth : ‘ఎక్స్‌’లో రేవంత్ బ్లూ టిక్ మాయం…

ప్రొఫైల్ మార్చ‌డంతోనే గాయ‌బ్
మ‌రో రెండు రోజుల‌లో వ‌స్తుంద‌న్న టీమ్
డిపి మార్చిన రేవంత్
రాహుల్ గాంధీతో న‌డుస్తున్న‌పిక్ తో ప్రొఫైల్

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ (ఎక్స్‌)లో సీఎం రేవంత్ రెడ్డి బ్లూ టిక్ మార్క్ మాయ‌మైంది. దీంతో అసలేం జరిగిందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఆరా తీస్తున్నారు. మ‌రికొంద‌రు రేవంత్ రెడ్డి అకౌంట్‌ హ్యాక్‌ అయిందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

- Advertisement -

అయితే, రేవంత్ రెడ్డి తన ప్రొఫైల్ పిక్చర్ మార్చడంతో సాంకేతిక సమస్య ఏర్పడి బ్లూటిక్ పోయినట్లు సీఎం సోషల్ మీడియా అకౌంట్లు చూస్తున్న ఆయ‌న టీమ్ స్పష్టం చేసింది. మరో రెండు రోజుల్లో బ్లూ టిక్ మార్క్ తిరిగి వస్తుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా ప్లాట్‌ఫారమ్‌పై ట్యాగ్ చేయడం, మెసేజ్ చేయడం కొనసాగించవచ్చని తెలియజేశారు. ఇక‌ రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఫోటో స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకుని నడిచిన ఫొటోను పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement