Thursday, April 25, 2024

KTR: ప‌ద‌వికే విర‌మ‌ణ ..సేవ‌కు కాదు …స‌ర్పంచ్ ల‌కు కేటిఆర్ ధ్యాంక్స్….

హైద‌రాబాద్ – తెలంగాణ‌లోని స‌ర్పంచ్ ల ప‌ద‌వీ కాలం నేటితో ముగిసింది.. నేటి నుంచి గ్రామాల‌లో ప్ర‌త్యేక అధికారులు పాల‌న ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి కెటిఆర్ ఐదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజానీకానికి సేవ చేసి పదవీ విరమణ చేస్తున్న సర్పంచ్‌లకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు.

కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ దామాలు నెలకొల్పడంలో దేశానికి ఆదర్శంగా నిలిచారని కేటీఆర్ సర్పంచ్ లను కొనియాడారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ అని ప్రజాసేవకు కాదన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement