Saturday, April 27, 2024

Ponnam Prabhakar: రేపటి నుంచే TG పేరుతో రిజిస్ట్రేషన్లు…

హైదరాబాద్‌: తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లపై ప్రజల మనోభావాల మేరకు టీఎస్‌ను టీజీగా మారుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. శుక్రవారం (మార్చి 15) నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు అన్నీ ఇకపై టీజీగా వస్తాయని ప్రకటించారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ”కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అణచివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకున్నాం. శాసనసభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మార్చాలని కేంద్రానికి పంపించాం. అందుకు ఆమోదం లభించింది. గత ప్రభుత్వం మాదిరిగా.. జీవోలను రహస్యంగా ఉంచాలనుకోవడం లేదు” అని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement