Saturday, April 27, 2024

TS : సిరిసిల్లాలో అత్యాచారం…దారుణ హ‌త్య ..

సిరిసిల్ల జిల్లాలో ఓ దారుణం చోటు చేసుకుంది. కూలీ పనులకు వెళ్ళిన ఓ మహిళ పై కొందరు వలస కూలీలు ఘోర అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారందరూ మద్యం మత్తులో ఓ మహిళ పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ మహిళను హత్య చేసి పారిపోయారు. కాకపోతే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

- Advertisement -

సిరిసిల్ల నగరంలోని అనంతనగర్ లో ఓ ఇంట్లో బిహార్ రాష్ట్రానికి చెందిన 6 మంది భవన నిర్మాణ కార్మికులు గత 6 నెలలుగా అద్దెకు నివసిస్తున్నారు. అందులో ఓ నలుగురు వ్యక్తులు 15 రోజుల క్రితమే బిహార్ కు వెళ్లారు. ఇది ఇలా ఉండగా రాముబ్రిక్ష సదా, రూడల్ సదా అనే ఇద్దరు బీహారీలు ఓ 4 రోజుల కిందట ఓ మహిళను వారి ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత వారు కనిపించలేదు. ఇదిఇలా ఉండగా వారి ఇంట్లో నుండి ఎక్కువ దుర్వాసన రావడంతో ఇంటి యజమాని రామస్వామి పోలీసులకు సమాచారం అందించాడు.

ఈమేరకు సీఐ రఘుపతి సంఘటన స్థలానికి వెళ్లి.. అక్కడ ఇంటి తాళం పగులగొట్టి చేస్తే.. ఇంట్లో రక్తపు మడుగులో మహిళ మృతదేహం కనపడింది. హత్యకి గురైన మహిళ తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వారి గదిలో మద్యం సీసాలు ఎక్కువగా ఉండటంతో మద్యం మత్తులో ఆ కార్మికులు అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారు మారిపోవడంతో పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక హత్యకు గురైన మహిళ వేములవాడ మండలం కొడుముంజకు చెందిన ఆలకుంట రమ గా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement