Saturday, April 27, 2024

Delhi: బిగ్‌బాస్‌కు స్వాగతం.. కేజ్రీవాల్‌కు సుఖేశ్ లేఖ

దిమ్మతిరిగే విషయాలను పేర్కొన్న కన్​మన్​
ముడుపులు డిమాండ్​ చేసింది కేజ్రీవాలే
మీ మోసాలను బహిర్గతం చేస్తాన్న చంద్రశేఖర్
తీహార్​ జైలులో తన బర్త్​డే ముందే వచ్చిందని వెల్లడి

ఆర్థిక నేరారోపణల కింద తీహార్ జైలులో ఉన్న కన్​మన్​ సుఖేశ్ చంద్రశేఖర్ ఎప్పటికప్పుుడు లేఖలు విడుదల చేస్తూ.. పలు సంచలనాలకు కేరాఫ్‌గా మారాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత, ఆప్ నేతలు కేజ్రీవాల్‌, సత్యేంద్రజైన్‌, సిసోడియాపై ఇప్పటికే ఆరోపణలు చేస్తూ సుఖేష్ పలు లేఖలు విడుదల చేశాడు. తాజాగా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు తీహార్ జైలు స్వాగతం పలుకుతుందంటూ లేఖ రాసిన సుఖేష్.. కేజ్రీవాల్‌ను వదిలిపెట్టలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈనెల 21న ఈడీ అరెస్ట్ చేయగా.. శుక్రవారం ఆయనను 6 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ‘తీహార్ క్లబ్’లోకి స్వాగతం అంటూ సుఖేష్ శనివారం మరో లేఖ విడుదల చేశాడు.

ముడుపులు డిమాండ్‌ చేసింది కేజ్రీవాలే..

కేజ్రీవాల్ మోసగాడు.. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటూ సుఖేష్ తన లేఖలో పేర్కొన్నాడు. తీహార్ క్లబ్ బిగ్ బాస్‌గా మిమ్మల్ని స్వాగతిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నాడు. మీ డ్రామాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇక ఎంత నటించినా తప్పించుకోలేరని సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు. మార్చి 25వ తేదీన తన పుట్టినరోజని, మూడు రోజుల ముందే బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు తెలిపాడు. మీ అరెస్ట్‌ను నా పుట్టినరోజు బహుమతిగా భావిస్తున్న అంటూ సుఖేష్ పేర్కొన్నాడు.

- Advertisement -

ముగ్గురు సోదరులు..

తీహార్ జైలును నడపడానికి తన ముగ్గురు సోదరులు ఇక్కడకు వచ్చారని.. ఒకరు ఛైర్మన్ బిగ్‌బాస్ అరవింద్ కేజ్రీవాల్ అయితే.. సీఈవో మనీష్ సిసోడియా, సీఓఓ సత్యేందర్ జైన్ అంటూ సుఖేష్ తన లేఖలో పేర్కొన్నాడు. బ్రదర్ కేజ్రీవాల్ మీ అవినీతి అంతా బయట పడబోతుంది.. మీరు సీఎం హోదాలో చేసిన స్కామ్‌లతో పేదలను దోచుకున్నారు అంటూ సుఖేష్ ఆరోపించాడు. మీ మోసాలను పూర్తిగా బహిర్గతం చేస్తానంటూ లేఖలో హెచ్చరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement