Thursday, May 9, 2024

RR | శంకర్‌పల్లి మున్సిపాలిటీలో మహిళ అదృశ్యం

శంకర్‌ప‌ల్లి (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లా శంకర్‌ప‌ల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగపురం టవర్ వద్ద మహిళ అదృశ్యమైన ఘటన జరిగింది. స్థానికులు పోలీసులు అందించిన సమాచారం మేరకు.. మున్సిపాలిటీ పరిధిలోని సింగాపురం టవర్ వద్ద విజయ్ కుమార్, గీత దంపతులు నివాసం ఉంటున్నారు. 27వ తేదీన ఇంట్లో భర్తతో జరిగిన గొడవ కారణంగా ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. విజయ్ కుమార్ త‌న‌కు తెలిసిన వారిని, బంధువుల ద‌గ్గ‌ర విచార‌ణ చేశాడు. ఎటువంటి సమాచారం దొరకలేదు. దాంతో విజయ్ కుమార్ శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వినయ్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement