Monday, May 6, 2024

దేవతల గుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతా : స‌బితా ఇంద్రారెడ్డి

దేవతల గుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామ‌ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ లో గల దేవతలగుట్ట శ్రీ స్వయంభు ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుక‌లు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మేయర్ పారిజాత నరసింహ్మ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, యువ నేత కార్తీక్ రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసంద‌ర్భంగా మంత్రికి దేవాలయ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. దేవాదాయ శాఖ ద్వారా పూర్తి సహకారం ఉంటుందన్నారు. హనుమంతుని విగ్రహం కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుకు కృషి చేద్దామన్నారు. ర్యాలీని శాంతియుతంగా జరుపుకోవాలని మంత్రి భక్తులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement