Monday, April 29, 2024

నీటి సమస్యలు తీర్చిన సీఎంకి ధన్యవాదాలు..

కుత్బుల్లాపూర్‌ : నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నీటి సమస్య తీర్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి డిప్యూటీ మేయర్‌ ధన్‌రాజ్‌యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. నిజాంపేట్‌ కార్పొరేషన్‌ ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న నీటి సరఫరా పైపులైన్‌ మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో కార్పొరేషన్‌లో ఎక్కడ నీటి సమస్యలు రాకుండా ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌, మేయర్‌ నీలా గోపాల్‌రెడ్డిల సహకారంతో పైపులైన్‌ ద్వారా నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ట్యాంకర్స్‌తో నీటి సరఫరాకు స్వస్తి పలికామని సీఎం కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు. ప్రస్తుతం కార్పొరేషన్‌ ఇందిరమ్మ కాలనీలో పైపులైన్‌లు మరమ్మత్తులు వలన అక్కడ ట్యాంకర్స్‌తో నీటి సరఫరా చేస్తున్నామని పైపులైన్‌ పనులు తరువాత నేరుగా నీటి సరఫరా చేస్తామని తెలిపారు. కార్పొరేషన్‌లో ప్రతి ఇంటింకి నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌, మేయర్‌ నీలాగోపాల్‌రెడ్డిలకు డిప్యూటీ మేయర్‌ ధనరాజ్‌యాదవ్‌, కార్పొరేటర్లు, కో అప్షన్‌ సభ్యులు, నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement