Monday, May 20, 2024

కెసిఆర్ చిత్ర ప‌టానికి ఎమ్మెల్యే వివేకానంద్ క్షీరాభిషేకం..

కుత్బుల్లాపూర్, : తెరాస హయాంలో రాష్ట్రం లోని అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నామని, ఈ ఘనత సి ఎం కేసీఆర్ దేనని ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేశారు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌కు 30 శాతం ఫిట్‌మెంట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న జరిగిన అసెంబ్లీ వేదికగా ప్రకటించడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హర్షాతిరేక‌లు వెల్లివిరిసాయి. ఇందులో ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హోంగార్డుల‌కు, వీఆర్ఏ, ఆశా వ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీల‌కు కూడా పీఆర్సీ వ‌ర్తిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటనతో కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎస్ఎఫ్ఎ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గౌడ్ నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడం సీఎం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనమన్నారు. పీఆర్సీ విషయంలో విపక్షాల నోర్లు మూతపడేలా సీఎం కేసీఆర్ ప్రకటించిన ఫిట్‌మెంట్‌ తో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ అధ్యక్షులు బిజిలి శ్రీనివాస్, జెనరల్ సెక్రెటరీ జానకి, ట్రెజరర్ అనిల్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement