Wednesday, May 15, 2024

అన్నివర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మండల స్థాయి విశ్వకర్మ సంఘం ఎన్నికలు ఈ నెల 27న జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బాలబ్రహ్మాచారి నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కులాల వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుల సంఘాలకు సొంత భవనాలను నిర్మించుకునేందుకు ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. అన్నివర్గాల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమలాకర్, మల్లేష్, వెంకటేష్, సతీష్ గట్టోజి, బ్రహ్మానంద, రవీందర్ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మండల విశ్వ కర్మ సంఘాల సభ్యులందరూ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement