Monday, May 6, 2024

పేదలకు అండగా సీఎం సహాయనిధి-మంత్రి కొప్పుల

కరీంనగర్‌: నిరుపేదలకు సీఎం సహాయనిధి ద్వారా తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని దొంగతుర్తి గ్రామానికి చెందిన తమ్మడవేని అంజయ్యకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 3.40లక్షల చెక్కును కరీంనగర్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని, ఆపద సమయంలో సీఎం సహాయనిధి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ పాలకుర్తి సత్యనారాయణ గౌడ్‌, ఎంపీటీసీ దాడి సదయ్య, మాజీ సర్పంచ్‌ జుంజుపల్లి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement