Wednesday, May 15, 2024

ఈతకు వెళ్లి.. ఇద్దరు యువకుల మృతి

వాగులో స‌ర‌దాగా ఈత‌కు వెళ్లి ఇద్ద‌రు యువ‌కులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటు చేసుకుంది. నానాజీపూర్‌ వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఉదయం సరదాగా ఇద్దరు ఈతకు వెళ్లగా.. ప్రాణాలు కోల్పోయారు. మృతులను జూకల్‌కు చెందిన మహేందర్‌, నదీమ్‌గా గుర్తించారు. మృతుల్లో ఒకరి మృతదేహం లభ్యమవగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement