మేడ్చల్ : బాచుపల్లి పియస్ పరిధిలోని ప్రగతి నగర్ KSR క్లాసిక్ అపార్ట్మెంట్ లో 20-20 ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న శిబిరంపై బాలనగర్, ఎస్ఓటి, పోలీసుల దాడి చేశారు. ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లు గణేష్ కుమార్, శ్రీనివాస్, రాంబాబు లను అరెస్ట్ చేసినట్లు కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముగ్గురు బుకీలు గణేష్, పాండు, రాజేష్ లు పరారయ్యారు. నిందితుల నుండి రూ.20.30లక్షల నగదు, 2ల్యాప్ టాప్, వన్లైన్ బోర్డ్, రూటర్, 7మొబైల్స్, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు వాడే ఎస్.బి.ఐ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.20లక్షల నగదు ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్ కి తరలించారు. మీడియా సమావేశంలో Acp చంద్రశేఖర్ తో పాటు బాచుపల్లి సిఐ సుమన్ రావ్, ఎస్ ఓటి సిఐ రాహుల్ దేవ్, ఎస్సై రాజశేఖర్, ఎసై కిషోర్, కానిస్టేబుల్ కృష్ణ మోహన్, అర్జున్, ముకుందం, మహేష్, కలీల్ పాల్గొన్నారు.
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్.. రూ.20లక్షలు సీజ్
- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement